తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నరసరావుపేట లో పర్యటించనున్నారని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనే ఈ ర్యాలీకి నరసరావుపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కుటుంబ సభ్యులు హాజరై తమ మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యంగా తెలుగు యువత, తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పల్నాడు రోడ్ లోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.