34.7 C
Hyderabad
May 5, 2024 01: 30 AM
Slider గుంటూరు

చంద్రన్న నరసరావుపేట పర్యటన విజయవంతం చేద్దాం

babu aravind

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నరసరావుపేట లో పర్యటించనున్నారని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ అమరావతి పరిరక్షణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.

పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనే ఈ ర్యాలీకి నరసరావుపేట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ కుటుంబ సభ్యులు హాజరై తమ మద్దతు తెలపాలని కోరారు. ముఖ్యంగా తెలుగు యువత, తెలుగు మహిళలు, టీఎన్ఎస్ఎఫ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ  హాజరై కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గుంటూరు రోడ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పల్నాడు రోడ్ లోని ఎస్ఎస్ఎన్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

Related posts

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

కార్తీక మాసం

Satyam NEWS

టార్గెట్ : భారత్ లో దాడులకు ఐఎస్ఐ కుట్ర

Satyam NEWS

Leave a Comment