40.2 C
Hyderabad
April 28, 2024 18: 00 PM
Slider పశ్చిమగోదావరి

చంద్రబాబు విమర్శలు కరెక్ట్ కాదు

#MLA Kotaru Abbayya Chaudhary

వై సి పి ప్రభుత్వం ఆర్ బి కె కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తుంటే ప్రతిపక్ష నేత మాజీ ముఖ్య మంత్రి వై సి ప్రభుత్వం పై బురద జల్లే విధంగా విమర్శలు చేయడం తగదని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి హితవు పలికారు.ఒకప్పుడు వ్యవసాయమే దండగని చెప్పిన పెద్దమనిషి ఈ రోజు అవకాశవాద రాజకీయ నాయకునిగా రైతుల పట్ల కపట ప్రేమ చూపించడం విడ్డూరంగా ఉందన్నారు.

రైతుల ధాన్యాన్ని ఆర్ బి కె కేంద్రాల ద్వారా వై సి పి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లిస్తుందని ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి ఋజువుచేశారు.

ఏలూరులో జిల్లా వై సి పి కార్యాలయం లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి వై సి పి ప్రభుత్వం పై చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు నిజం కాదని రుజువు చేశారు.అందుకు నిదర్శనంగా ఆర్ బి కె కేంద్రాలకు ధాన్యం తొలిన రైతులకు డబ్బులు చెల్లించామని తమ్మినేని పొలయ్య.

శుభాకర్ అనే రైతులు పంపిన ధాన్యానికి ఈ నెల 2వ తేదీన కూడా పొలయ్య అనే రైతుకు10 లక్షల 61 వేల 792 రూపాయలు.శుభాకర్ అనే రైతుకు 2లక్షల 97 వేల రూపాయలు చెల్లించడం జరిగిందని ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి వెల్లడించారు.మీ స్క్రిప్ట్.మీ డైరెక్టన్.లతో వై సి పి ప్రభుత్వం పై లేనిపోని నిందలు వేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.చంద్రబాబు చేసిన విమర్శలు తప్పు అని చెప్పడానికి రైతులు వచ్చారని అబ్బయ్యచౌదరి
విలేకరుల సమావేశం లో తెలిపారు

Related posts

గులకరాయి డ్రామాలో టీడీపీ నేతల్ని ఇరికిస్తే ఊరుకోం

Satyam NEWS

మనమే నెంబర్ 1: ఎందులో…. జనాభాలో

Bhavani

స్వీట్లే కాదు సమాజానికి స్ఫూర్తిని పంచిన పుల్లారెడ్డి

Satyam NEWS

Leave a Comment