2019 సంవత్సరానికి సంబంధించిన సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి ర్యాంకు రావడం అప్పటి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనమని గుంటూరు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జీ డాక్టర్ చదలవాడ అరవిందబాబు అన్నారు.
దేశీయ ప్రపంచస్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొల్పేందుకు ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్ లు ప్రకటిస్తుంది. 2019 ఏడాదికి గాను ర్యాంకింగ్స్ లో ఆంద్రప్రదేశ్ తొలి స్థానంలో నిలవగా.. ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలోను, తెలంగాణ మూడో స్థానంలోను నిలిచాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చాక చేసింది సున్నా ,కేవలం గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన కృషి కారణంగానే ఈజె ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి అగ్ర స్థానం లభించిందని ఆయన అన్నారు. చంద్రబాబు ప్రస్తుతం అధికారం లో లేకపోయినా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇప్పటికీ ఏపీ ని దేశంలో నెంబర్ వన్ గా నిలబెడుతూనే ఉన్నాయని ఆయన అన్నారు.
2019 ఆగస్టు వరకు లెక్కకట్టి తీసిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీకి మరోసారి తొలి స్నానం లభించిందని ఆయన అన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పారిశ్రామిక విధానాలు, ఈ ప్రభుత్వానికి అక్కరకు వచ్చాయని చదలవాడ అన్నారు.
అదే 2019 జూన్ తర్వాత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రం పదో స్థానం లో ఉండేదని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అహంకారంతో తో భేషజాలకు పోకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో రాష్ట్రానికి వచ్చిన ర్యాంకు ని వినియోగించుకోవాలని, రాష్ట్రానికి పరిశ్రమలు, కంపెనీలు వచ్చేలా చొరవ చూపి, రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వెయ్యాలని ఆయన కోరారు.