అందరి సమిష్టి కృషితోనే అభివృద్ధి అత్యంత సాధ్యమని నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సైదిరెడ్డి మాట్లాడుతూ మండలంలో నిధులు మంజూరైనాయని,పలు అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అదికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టితో పనిచేయాలని సూచించారు.తదనంతరం మండలంలో 33 మంది సిఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు 10,43,500 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి , ఎంపిపి పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, జెడ్పిటిసి పోరెడ్డి శైలజా రవీందర్ రెడ్డి, వైస్ ఎంపిపి గుత్తికొండ ప్రమీల , ఎంపిటిసి, సర్పంచ్ లు అధికారులు తదితరులు పాల్గొన్నారు.