హుజూర్ నగర్ పట్టణం లోని (మిర్యాలగూడ క్రాస్ రోడ్)వద్ద చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటి మున్సిపల్ కమీషనర్ కి మంగళవారం వినతి పత్రం అందచేసింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ముసుకుల చంద్రారెడ్డి, హుజూర్ నగర్ మండల అధ్యక్షుడు కుందూరు కోటిరెడ్డి,వేముల శేకర్ రెడ్డి, చింతలపూడి ఉమా మహేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శులు ఇంటి రవి,ఉద్దోజు జగన్,మందా వెంకటేశ్వర్లు,చిత్తలూరి సోమయ్య,గండు శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు డా.గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడతామని వినతి పత్రంలో పేర్కొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్