సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై మియాపూర్ పీఎస్లో చీటింగ్ కేసు నమోదైంది. శేఖర ఆర్ట్ క్రియేషన్స్ యజమాని శేఖర్ రాజు ఫిర్యాదు మేరకు మియపూర్ పోలీస్ లు కేసు నమోదు చేశారు.
దిశ చిత్రాన్ని నిర్మించి విడుదల చేసిన తర్వాత వర్మ తన నుండి 56 లక్షలు తీసుకున్నాడని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బెదిరిస్తున్నాడని ఆయన మియపూర్ పోలీస్ స్టేషన్ లో అందించిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దాంతో మియాపూర్ పోలీసులు రాంగోపాల్ వర్మపై మియాపూర్ పీఎస్లో చీటింగ్ కేసు నమోదు చేశారు