21.7 C
Hyderabad
December 2, 2023 03: 52 AM
Slider ఖమ్మం

డబుల్ ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చండి

#double voters

పాలేరు నియోజక వర్గ పరిధిలో ఉన్న డబుల్ ఓటర్ల జాబితా పై నిగ్గు తేల్చాలని కోరుతూ పాలేరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం రూరల్ తహాశీల్దార్ రామకృష్ణకి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి ఫిర్యాదుచేశారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 1500 కు పైగా ఓటర్ల పేర్లు రెండు వేర్వేరు పోలింగ్ బూత్ కేంద్రాల్లో నమోదై ఉన్నట్లు తాము గుర్తించామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వారు గుర్తించిన జాబితాను ఎన్నికల అధికారికి అందచేశారు. ఈ సందర్భంగా స్వర్ణకుమారి మాట్లాడుతూ పాలేరు నియోజకవర్గంలో 1568 మంది ఓటర్లలో కొంతమంది ఓటర్ల పేర్లు ఇక్కడే ఉన్న రెండు వేర్వేరు పోలింగ్ బూత్ లలో నమోదైఉన్నాయన్నారు.

అదేవిధంగా మరికొంతమంది ఓటర్ల పేర్లు పాలేరు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ కేంద్రాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో అక్కడ ఉన్న పోలింగ్ బూత్ కేంద్రాల్లోనూ నమోదై ఉన్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆధారాలతో సహా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించమన్నారు. ఆ జాబితా ను పరిశీలించి డబుల్ ఓటర్లను తొలగించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన మండలాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం

Satyam NEWS

ఏపీలో ఆగస్టు 16 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

Satyam NEWS

యువత సేవా దృక్పథంతో ముందుకు సాగాలి

Sub Editor

Leave a Comment

error: Content is protected !!