ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజికవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 11 లక్షల 53 వేల రూపాయల చెక్కులను ఆయన అందచేశారు.
కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మామిండ్ల నర్సింలు, కొనాపూర్ గ్రామానికి చెందిన దిడ్డి రాజు, యాడారం గ్రామానికి చెందిన నీరడి పర్శరాములు, మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన పోతరాజు లింగం లు ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున మొత్తం 8 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1,191 మందికి 7 కోట్ల 61 లక్షల 96 వేల 300 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.
ప్రమాదవశాత్తు అనారోగ్యం బారిన పడి, రోడ్డు ప్రమాదాలను గురై ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కర్చైన డబ్బులను ముఖ్యమంత్రి సహయనిధి నుండి ఇప్పించడం జరుగుతుందని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఒకవైపు పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని మరోవైపు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆయన అన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం