ఘట్ కేసర్ కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కిడ్నాప్నకు గురైన నాలుగేళ్ల చిన్నారి క్రిష్ణవేణి సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సురేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే రాత్రి చాక్లెట్ కొనేందుకు వెళ్లిన పాప కిడ్నాప్నకు గురైన విషయం తెలిసిందే.
సమీపంలోని జగదాంబ థియేటర్లో పని చేసే మతిస్థిమితం లేని సురేష్ పాపను కిడ్నాప్ చేశాడు. పోలీసులు కిడ్నాప్ను సవాలుగా తీసుకుని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.