ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశంలో ప్రాణాంతకమైన కరోనావైరస్ నివారణకు ప్రసిద్ధ చిల్కూర్ బాలాజీ ఆలయంలో 2 వేల మంది భక్తులు ప్రత్యేక ప్రార్థన చేశారు.’వీసా గాడ్’ గా ప్రసిద్ది చెందిన చిల్కూర్ బాలాజీ ఆలయంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా ‘అపమర్జన స్తోత్రం’ మరియు ‘సుదర్శన అష్టకం’ పారాయణం చేశారు.
కరోనావైరస్ వాళ్ళ చైనాలో 500 మందికి పైగా మరణించగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20,000 మందికి ఈ వ్యాధి సోకింది. మీడియాను ఉద్దేశించి ఆలయ పూజారి రంగరాజన్ మాట్లాడుతూ “సింహ దేవుడైన నర్సింహ స్వామి ని ఉపాసన చెస్తూ ప్రపంచాన్ని ఆశీర్వదించమని, అంటువ్యాధి కరోనావైరస్ను నివారించాలని మేము ప్రతి దేవుడిని ప్రార్థించామన్నారు.
ఇది చైనాలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తం గా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచవ్యాప్తంగా. ఈ వైరస్ నివారణ కోసం మేము ప్రార్థించాము. “అని ఆయన తెలిపారు. జపాలతో, పూజలతో, హోమాలతో చిల్కూర్ బాలాజీ ఆలయం సందడి గా మారింది.ఈ వైరస్ డిసెంబర్లో చైనా నగరమైన వుహాన్ నుండి ఉద్భవించింది మరియు అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు వ్యాపించింది.