28.7 C
Hyderabad
April 26, 2024 09: 13 AM
Slider ఆదిలాబాద్

ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ సేవలు ప్రారంభం

#TSRTC Cargo Service

ఇన్నాళ్లు ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతూ వస్తున్న ఆర్టీసీ తాజాగా పార్సిల్​, కార్గో సర్వీస్​లకు శ్రీకారం చుట్టింది.  ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ఆదిలాబాద్​,  ఉట్నూర్​, నిర్మల్​, ఖానాపూర్​,  భైంసా,  మంచిర్యాల,  చెన్నూర్,  జన్నారం,  లక్షిట్​పేట,  ఆసిఫాబాద్​,   బెల్లంపల్లి, కాగజ్​నగర్​ ప్రాంతాల నుంచి ప్రజలకు ఈ సేవలందించేలా ఏర్పాట్లు చేసింది. 

శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఆదిలాబాద్ బస్టాండ్​ ఆవరణలో ఈ కార్గో సర్వీస్​ సేవలను ఆర్ఎం డి.విజయభాస్కర్  ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. పార్సిల్​ బుక్​ చేసుకున్నవారికి,  రిసీవ్ చేసుకునేవారికి ఎస్​ఎంఎస్ ద్వారా సెల్​ఫోన్​కు సమాచారమందిస్తామని ఆర్ఎం తెలిపారు. 

త్వరలోనే  ట్రాకింగ్​ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలోని ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్నప్తి చేసారు.

ఈ కార్యక్రమంలో  డీవీఎం .పిరమేష్​,  డీఎం శంకర్ రావు ,  ఎంఎఫ్​ రాజేందర్​, సీఐ రాజశేఖర్​,  కార్గో ఇంచార్జీ ఎస్​కె అన్సార్​, వెంకన్న,  కెఎస్​.రావు,  రహామాన్​, రిజర్వేషన్​ ఇంచార్జీ ఎస్​ఎ.హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Related posts

యశోద పై కేసు

Murali Krishna

రేపటి నుండి ములుగు జిల్లాలో లో రెండో దశ కరోనా టీకా

Satyam NEWS

శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి

Satyam NEWS

Leave a Comment