ఇన్నాళ్లు ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతూ వస్తున్న ఆర్టీసీ తాజాగా పార్సిల్, కార్గో సర్వీస్లకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్, నిర్మల్, ఖానాపూర్, భైంసా, మంచిర్యాల, చెన్నూర్, జన్నారం, లక్షిట్పేట, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, కాగజ్నగర్ ప్రాంతాల నుంచి ప్రజలకు ఈ సేవలందించేలా ఏర్పాట్లు చేసింది.
శుక్రవారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ఆదిలాబాద్ బస్టాండ్ ఆవరణలో ఈ కార్గో సర్వీస్ సేవలను ఆర్ఎం డి.విజయభాస్కర్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. పార్సిల్ బుక్ చేసుకున్నవారికి, రిసీవ్ చేసుకునేవారికి ఎస్ఎంఎస్ ద్వారా సెల్ఫోన్కు సమాచారమందిస్తామని ఆర్ఎం తెలిపారు.
త్వరలోనే ట్రాకింగ్ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు ఆర్టీసీ కార్గో సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్నప్తి చేసారు.
ఈ కార్యక్రమంలో డీవీఎం .పిరమేష్, డీఎం శంకర్ రావు , ఎంఎఫ్ రాజేందర్, సీఐ రాజశేఖర్, కార్గో ఇంచార్జీ ఎస్కె అన్సార్, వెంకన్న, కెఎస్.రావు, రహామాన్, రిజర్వేషన్ ఇంచార్జీ ఎస్ఎ.హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు