ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకే ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ వరుసకు అక్క, తమ్ముడు కావడంతో ఈ సంఘటన సంచలనం సృష్టిస్తుంది.కుల్కచర్ల ఎస్సై వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం కామునిపల్లి గ్రామానికి చెందిన వరుసకు అక్క, తమ్ముడైన మమత(20), ప్రశాంత్(19)లు ఒకే ఫ్యాన్కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు ప్రేమే వ్యవహారమే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
previous post