సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి
వెన్నుతట్టి గన్ను పట్టితే రజాకార్లు బేజారు.పేరెత్తితే గడిల దొరల గుండెలు జారె.పట్టణాలకు పరిగెత్తిరే ప్రళయ భయంకర గొంతువిని భూస్వాములు పరుగెత్తిరే.
ఆఖరి శ్వాస ఉన్నంత వరకు ఆశయాలకు కోసం పేద ప్రజల కోసం పోరాట వీరవనిత విప్లవజ్యోతివై విప్లవ అభివందనాలు. అమ్మా నీ స్ఫూర్తితో కష్ట జీవుల హక్కులకై నిరంతరం పోరాడుతామని ప్రమాణం చేస్తున్నామని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి అన్నారు.
మల్లు స్వరాజ్యం అంత్యక్రియల సందర్భంగా ఆదివారం హుజూర్ నగర్ నుంచి నల్లగొండ కు కార్మికులు బయలుదేరిన సందర్భంగా రోషపతి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మనకిక లేరని తీవ్ర మనో ఆవేదన తెలిపారు.మల్లు ఆశీస్సులు ఆమె ఆశయ స్ఫూర్తితో ఈ నెల 28, 29న,జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద కార్మిక లోకం ఎత్తున పాల్గొని ఘనంగా నివాళులు అర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎలక సోమయ్య గౌడ్,గోవిందు,పి.రాజు,వెంకన్న,పి.వేణు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్