హైదరాబాద్ లోని అంబర్ పేట్ నియోజకవర్గానికి చెందిన వెంక రెడ్డి నగర్ నివాసి నిరుపేద కుటుంబం అయినా ఎం.వెంకటేష్ కరోనాతో చనిపోవడంతో వారికి సంబంధించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తమై మంత్రి తన్నీరు హరీష్ రావు ద్వారా సి.యం.ఆర్.ఎఫ్ దరఖాస్తు చేసుకున్న, వారికి రూ:60,000/- మంజూరు ఆయ్యాయి.
ఆదివారం వారి కుటుంబ సభ్యులకు దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ రూ60,000/- చెక్కును వారి కుటుంబ సభ్యుల కు అందచేశారు. ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కే.టి.ఆర్ కి, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అంబర్పేట్ నియోజకవర్గం సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట