ములుగు జిల్లా దేవగిరిపట్నం లోని శ్రీ జగదాంబదేవి సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ దేవాలయంలో దుర్గ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రాంభమయాయి.
ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాదేవి మొదటి రోజున శైలపుత్రి గా దర్శనమిచ్చారు.
అమ్మవారికి నైవేద్యముగా కట్టే పొంగలి పెరుగు అన్నం దానిమ్మ గింజలు శ్రీ బాల బ్రమ్మ చారి కిషన్ మహారాజ్ శెలపుత్రి అలంకరణలో దర్శనమిచ్చిన దుర్గాదేవికి నైవేద్యం సమర్పించారు.
అమ్మవారిని అధిక సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకున్నారు. ఈ ఉత్సవ వైభవానికి హాజరైన భక్తులందరికీ శ్రీ బాల బ్రహ్మచారి కిషన్ మహారాజ్ తీర్థ ప్రసాదాలు అందజేశారు.