రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలనీ రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు జిహెచ్ఎంసి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా సోమవారం రామంతపూర్ డివిజన్ లోని నెహ్రు నగర్, ఇందిరానగర్లలో స్ట్రామ్ వాటర్ నిలిచి ఉండడంతో కాలనీ వాసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ఆయా కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీవాణి మాట్లాడుతూ రోడ్లపై స్ట్రాం వాటర్ నిలవకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షులు బండారు వెంకట్రావు , ఏఈ. శ్వేత, వర్క్ ఇన్స్పెక్టర్ మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి