అమ్మవారు దయ వల్ల ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి అన్నారు. సోమవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలో నెహ్రూ నగర్ కాలనీ హెచ్. సీ. ఎల్. చౌరస్తా లో శ్రీ పోచమ్మ , శ్రీ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు మల్లాపూర్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు పన్నాల దేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఆలయ కమిటీ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారు దయ వల్ల ప్రజలందరూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , స్థానికులు శంకర్, సుధాకర్, భూషణం శ్రీను, రాపోలు శ్రీనివాస్, మెండ రఘు తదితరులు పాల్గొన్నారు