విజయనగరం జిల్లా సమీపంలో దాకమర్రి గ్రామ పరిధిలోని రఘు ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు రాష్ట్ర సీఎం జగన్ హాజరయ్యారు. కళాశాల ఎదురుగా ఉన్న ఎన్.సి.సి. మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు బుధవారం సాయంత్రం సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా కళాశాల లోపల ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు చేరుకొని నూతన వధూవరులైన మణిదీప్, స్నేహాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బడ్డుకొండ అప్పలనాయుడు కుటుంబీకులతో బృంద చిత్రం దిగారు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల సభ్యులతో ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించారు. ఆయన వెంట మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే అప్పలనాయుడు కుటుంబీకులు ఉన్నారు.
previous post