రవి వర్మకు అందని అందానివి నీవే ,జై కిసాన్ అన్న లాల్ బహదూర్ శాస్త్రీ లోని మానవత్వము నువ్వే అంటూ నటి సమంతా అక్కినేని ని ఆకాశానికెత్తేస్తున్నారు నెటిజన్లు.సమంత తాజాగా తన ఇన్ స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. భారతదేశపు గొప్ప కళాకారులలో ఒకరైన రవివర్మ గీసిన అందమైన ముద్దుగుమ్మలా చేతిలో ఓ నిమ్మపండుతో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
అయితే మహారాష్ట్రలో రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే ‘నామ్ ఫౌండేషన్’ ప్రాజెక్ట్లో భాగంగా ఆ ఫోటోని తీయడం జరిగింది. దీంతో ఆ ఫిక్ను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.అందానికి అందం ,రైతు శ్రేయస్సు లో మానవత్వం చూపుతున్న సమంతకు హాట్స్ అప్ .