40.2 C
Hyderabad
April 29, 2024 17: 06 PM
Slider హైదరాబాద్

ఫీజు బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

#amberpet

పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలను విడుదలు చేయాలని విద్యార్థి జన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. గత రెండు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్ బకాయిలు దాదాపు 3300 కోట్లు నిధులు విడుదల చేయక పోవడం వలన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంటర్ డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కళాశాలల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేయాలని రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా కమిటీల నాయకత్వాన్ని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు బకాయిల మీద ఆధారపడి చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనారిటీ విద్యార్థులను విద్య కు దూరం చేసే దురుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన చేస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో, వివిధ కోర్సులను పూర్తి చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

కావున పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్  ప్రెసిడెంట్ మాసంపల్లి అరుణ్ కుమార్, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు నకరికంటి నరేందర్, హైదరాబాద్ జనరల్ సెక్రెటరీ డప్పు గోపి, ప్రశాంత్, సమయ్య,అస్లాం తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

విత్తనాలు సకాలంలో అందించే బాధ్యత అధికారులదే

Bhavani

పత్తికొండలో 26 నాటు బాంబులు స్వాధీనం

Satyam NEWS

సెన్సార్ పూర్తి చేసుకున్న “వి లవ్ బ్యాడ్ బాయ్స్”

Satyam NEWS

Leave a Comment