30.7 C
Hyderabad
May 5, 2024 03: 05 AM
Slider విశాఖపట్నం

13న సీఎం జగన్ వైజాగ్ పర్యటన

#y s jagan 1

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటనకు వెళుతున్నారు. వాహనమిత్ర లబ్ధిదారులకు చెక్కులను ఆయన అక్కడ పంపిణీ చేయబోతున్నారు. 13న ఉదయం 10.30 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు.

11.05 గంటలకు ఆంధ్ర యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ కు చేరుకుంటారు. 10 నిమిషాల పాటు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం వైఎస్సార్ వాహనమిత్ర లబ్ధిదారులతో ఫొటో సెషన్ ఉంటుంది. 11.47 నుంచి 12.17 వరకు ఆయన ప్రసంగం ఉంటుంది.

12.20 నుంచి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానాశ్రయంలో 12.55 గంటల నుంచి 1.15 గంటల వరకు స్థానిక నాయకులతో భేటీ అవుతారు. 1.20 గంటలకు గన్నవరంకు తిరుగుపయనమవుతారు.

Related posts

సందీప్ రెడ్డి  మరణం తీరని లోటు

Satyam NEWS

ఘనంగా హోమియో పితామహుడు డాక్టర్ హానీమన్‌ జయంతి

Satyam NEWS

గురజాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

Satyam NEWS

Leave a Comment