37.7 C
Hyderabad
May 4, 2024 11: 53 AM
Slider చిత్తూరు

సీఎం జగన్‌ నీ పనైపోయింది

#Chandrababu

‘‘సీఎం జగన్‌ నీ పనైపోయింది.. ప్రజలన్నీ గమనిస్తున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన తనను ప్రజల దగ్గరకు రానివ్వరా? అని ప్రశ్నించారు. కుప్పం నియోజకవర్గం మంచికి మారుపేరు ఉందని తెలిపారు. తప్పుడు పనులు చేసేవారిని చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు. వైసీపీ కి పోలీసులు ఊడిగం చేస్తున్నారా?.. తను అడ్డుకోవడానికి 3 వేల మంది పోలీసులా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

తన పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఏపీలో సైకో జగన్‌రెడ్డి పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని, రకరకాల పన్నుల పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఇంత చెత్త పరిపాలన తానెక్కడా చూడలేదని చంద్రబాబు అన్నారు.

Related posts

గుడ్ జాబ్: ఎగుమతుల్లో వృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

జనం నోట అన్నమయ్య సంకీర్తనలు

Bhavani

ప్రజా సేవలో ఆకాశం ఎత్తుకు వెళ్లిన సాయి సుధ

Satyam NEWS

Leave a Comment