26.7 C
Hyderabad
May 3, 2024 07: 54 AM
Slider ప్రత్యేకం

ఫిరాయించిన ఎమ్మెల్యేలతో బానిసత్వం చేయిస్తున్నారు

#mallu ravi

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వారితో బానిసత్వం చేయించుకుంటున్నారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అన్నారు.

కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఆచ్చోసిన దున్నపోతుల్లా కేసీఆర్ ఏం చెపితే అది వాగుతున్నారని వారు విమర్శించారు. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తోపాటు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యే లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని వారన్నారు.

పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని తిడితే వాళ్లకు కేసీఆర్ దగ్గర మార్కులు పడుతున్నాయనుకుంటున్నారని మల్లు రవి అన్నారు. కేసీఆర్ మెప్పు కోసం కుక్కుల్లా మొరుగుతున్నారని ఆయన అన్నారు.

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు గా రావడంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఆయన తెలిపారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతున్న తీరు ఆయన భయానికి పరాకాష్ట అని మల్లు రవి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లో పర్యటించలేదని, కరోనా సమయంలో ఇంట్లో పండుకున్నాడని సుధీర్ రెడ్డి మాట్లాడడడం ఆయన అవివేకానికి పరాకాష్ట అని రవి అన్నారు.

రేవంత్ రెడ్డి కంటోన్మెంట్లో ఏకంగా 50 పడకల ఆసుపత్రి కట్టించి రోగులకు సేవలు అందించారు. ప్రతి రోజు వేలాది మంది నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించి వారికి వారిని ఆకలి తీర్చారని ఆయన అన్నారు.

కరోనా సమయంలో లింగోజిగూడా డివిజన్ ఉప ఎన్నికలు వస్తే టిఆర్ఎస్, బీజేపీలు కలిసి పోటీ చేసినా జనం తరిమికొట్టి కాంగ్రెస్ ను గెలిపించారని ఆయన గుర్తు చేశారు.

Related posts

ఏపీలో ఉన్నది ప్రభుత్వం కాదు గుండా రాజ్యం

Satyam NEWS

నిజమైన పేదలకే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలి

Satyam NEWS

మాదిగ జర్నలిస్టు జాతీయ మహాసభను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment