ఏపీ అభ్యంతరాలు బేఖాతరు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుదుత్పత్తిని మరింత పెంచింది.
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుదుత్పత్తి చేస్తోందని ఏపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యుదుత్పాదన మరింత పెంచింది.
కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిన తెలంగాణ జెన్ కో… ఇవాళ మధ్యాహ్నం 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసిందని ఏపీ అధికారులు ఆరోపించారు.
పులిచింతలలోని 3 యూనిట్ల నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు.