33.2 C
Hyderabad
May 11, 2024 13: 44 PM
Slider నిజామాబాద్

చరిత్రలో నిలిచిపోయేలా కేసీఆర్ గెలుపు

#nittujahnavi

చరిత్రలో నిలిచిపోయేలా కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ గెలుపు ఉండాలని, దానికోసం అందరం సమిష్టిగా ముందుకు వెళ్తామని కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో నేడు నిర్వహించిన మీడియా సమావేశంలో చైర్మన్ నిట్టు జాహ్నవి మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక సీఎం కామారెడ్డి నుంచి పోటీ చేయడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఇక్కడ కేసీఆర్ పోటీ చరిత్రలో నిలుస్తుందని, సీఎం పోటీతో కామారెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిని ఎంచుకోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి వేగం పుంజుకోనుందని తెలిపారు. ప్రధానంగా తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ప్రత్యేక నిధులతో కామారెడ్డి రూపురేఖలు మారిపోయాయని, ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీ కార్పోరేషన్ కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. కేసీఆర్ గతంలో పోటీ చేసిన ప్రాంతాల్లో వచ్చిన మెజారిటీ కంటే భారీ మెజారిటీ ఇక్కడ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్  కౌన్సిలర్లు పాల్గొన్నారు

Related posts

విశాఖలో వెలుగులోకి వచ్చిన బ్లాక్ ఫంగస్ కేసు?

Satyam NEWS

పోలీస్:12 మంది అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

Satyam NEWS

స్వచ్ఛ తెలంగాణ సాధన లో మరో ముందడుగు

Satyam NEWS

Leave a Comment