టీఎస్ డబ్ల్యూ గోదాంలో హమాలీ మేస్త్రీగా పనిచేస్తున్న గోపయ్య కుమారుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సిఫార్సు మేరకు మంజూరైన 50,000 రూపాయల చెక్కును సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ టిఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో గురువారం టిఆర్ఎస్ కెవి తరుపున స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి బాధితుడికి అందజేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ పేదరికంలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాధితుని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.