అభాగ్యులకు అండగా…ఆర్థిక భరోసా గా సీఎం సహాయ నిధి ఉందని నల్గొండ జిల్లా దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. వివిధ కారణాలతో అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులు అందచేశారు.
డిండి మండలం జెత్య తండాకు చెందిన సుమన్ కు రూ.14,000,అదే గ్రామానికి చెందిన టీవీకి 60,000, నేరడుగొమ్ము గ్రామానికి చెందిన కైకకి 18,000 సీఎం సహాయ నిధి నుంచి మంజూరు చెక్కులను బాధితులకి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. సీఎం సహాయ నిధి పేద ప్రజలకు వెలుగులు నింపుతుంది అన్ని అన్నారు.
ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్భందువునిగా అదుకుంటుంది అని ఆయన తెలిపారు మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్దిక సహాయాన్ని మంజూరు చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సిరందాసు కృష్ణయ్య, మాజీ ఎంపీపీలు ముత్యాల సర్వయ్య, లోకసాని తిరపతయ్య, ఎంపీటీసీ వాంకుణావత్ బిక్కు,వేముల రాజు,బొడ్డుపల్లి కృష్ణ,చిత్రం ఏసోబు తదితరులు పాల్గొన్నారు.