అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం అందించి హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆదుకున్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గరేడేపల్లి మండలం రంగపురం గ్రామానికి చెందిన గుండు వంశీ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
చికిత్స చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఈ విషయాన్ని కుటుంబసభ్యులు స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
సమస్య విని తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సైదిరెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 3,00,000లక్షల రూపాయలు(ఎల్ఓసి) వంశీ వైద్యం కోసం మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా గుండు సైదులు కుటుంబ సభ్యులు,వార్డు ప్రజలు శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్