గన్నవరం విమానాశ్రయం లో కొత్తగా నిర్మించిన రన్ వే, ఇతర అభివృద్ధి పనులను అధికారుల బృందంతో కలిసి కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ ఎండి ఇంతియాజ్ నేడు పరిశీలించారు.
రూ.470 కోట్లతో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం నిర్మించారు. అదే విధంగా మరో రూ.27 కోట్ల తో ఆప్రాన్ లింక్ టాక్సీ వే కూడా నిర్మించనున్నారు.
రాబోయే 10 రోజుల్లో క్రొత్త రన్ వే ద్వారా రాకపోకలు ప్రారంభానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సర్వీసులు అందులోకి రావడంతో త్వరలో బోయింగ్ 777, 747 అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.