సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హుజూర్ నగర్ క్యాంపు కార్యాలయంలో గరిడేపల్లి గ్రామానికి చెందిన కొప్పు సైదులు కి 2లక్షల రూపాయల సిఎమ్ఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ ఎన్నో పేద కుటుంబాలకు చిత్తశుద్ధితో ఆసుపత్రి వైద్య ఖర్చులు ఇస్తున్న ప్రభుత్వం కేవలం టిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో హుజుర్ నగర్ మార్కెట్ చైర్మెన్ కడియం వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణ నాయక్, గరిడేపల్లి మండల పార్టీ కో-ఆర్డినేటర్ పిడమర్తి రాజు,గ్రామశాఖ అధ్యక్షుడు సైదులు,ఉపాధ్యక్షుడు కృష్ణ,మండల యూత్ అధ్యక్షుడు నాగేశ్వరరావు, గానుగబండ సతీష్,రేగులగడ్డ తండా సర్పంచ్ బివిటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్