26.7 C
Hyderabad
April 27, 2024 08: 07 AM
Slider ప్రత్యేకం

అకస్మాత్తుగా తిరుపతి ప్రచారానికి వస్తున్న సిఎం జగన్

#YSJaganmohanReddy

ఇంట్లో కూర్చుని అన్ని మునిసిపాలిటీలను, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలను గెలిపించిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకో గానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారానికి వెళుతున్నారు.

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతున్నది. బిజెపి నేతలు తిరుపతిలోనే క్యాంప్ వేసి ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు అక్కడే తిష్టవేసి ఉన్నారు. పటిష్టమైన స్థితిలో ఉన్నదనుకున్న వైసీపీకి ముఖ్యమంత్రి ప్రచారం అవసరం అవుతుందని ఎవరూ అనుకోలేదు.

ఆయన కూడా ప్రచారానికి వస్తారని ఎవరూ అనుకోలేదు. మరి ఎందుకో ఆయన తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్నారు.

ఈనెల 14వ తేదీన ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ప్రజల్లోకి సీఎం జగన్ వస్తున్నారు.

తిరుపతి లోక్ సభ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పరిస్థితి ఆశించిన మేరకు లేదని పార్టీ వర్గాల నుండి సమాచారం.

ఇంటెలిజెన్స్ నివేదిక లో కూడ ఇదే సమాచారం వచ్చినట్లు తెలిసింది. దీంతో తానే ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించిన సీఎం జగన్ ప్రచారానికి వస్తున్నారని తెలిసింది.

Related posts

అప్పుల బాధతో ఒకే కుటుంబంలోని ఐదుగురి మృతి

Bhavani

సాల్ట్ ప్రాజెక్టు  అంతిమ లబ్ధిదారులు ఎవరు?

Satyam NEWS

రాజకీయ వైరాగ్యంపై పేర్ని నాని మాటల్లో అంతరార్ధం ఏమిటి?

Bhavani

Leave a Comment