సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులగా ఆదుకుంటుందని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గం పాన్ గల్ మండలం రేమద్ధుల గ్రామానికి చెందిన P.లక్ష్మి W/O P.శివయ్య కు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.3,00,000/- ల ఎల్వొసిని వారి కుటుంబ సభ్యులకు ఆయన అందచేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందని అన్నారు. తమ ఆర్థిక పరిస్థితిని గమనించి ప్రత్యేక చొరవ తీసుకొని మూడు లక్షల ఎల్వోసీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ కు, కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి లక్ష్మీ కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.