42.2 C
Hyderabad
April 26, 2024 16: 13 PM
Slider నల్గొండ

పోలియో నిర్మూలన మనందరి బాధ్యత: ఎమ్మెల్యే సైదిరెడ్డి

#palsepolio

పోలియో నిర్మూలన సామాజిక బాధ్యతని హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో పలు పోలియో సెంటర్లలో పోలియో చుక్కల కేంద్రాలను శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి మాట్లాడుతూ పోలియో మహమ్మారిని అంతమొందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య శాఖ ద్వారా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.

పిల్లల నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో కీలకమని,పోలియోను శాశ్వతంగా  నిర్మూలించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని  నిర్మిద్దామని అన్నారు. పోలియో నిర్మూలనకు వైద్య ఆరోగ్య శాఖకు సహకారం అందిస్తూ ఈ మూడు రోజులపాటు విస్తృతంగా ప్రచారం చేసి 0-5 సంవత్సరాల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని అన్నారు.పోలియో చుక్కలు వేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని,తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకుండా కేంద్రాల వద్దకు పిల్లల్ని తీసుకెళ్లి పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ సందర్భంగా సైదిరెడ్డి చిన్నారులను ఎత్తుకొని పోలియో చుక్కలు వేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉచితంగా మూడు స‌బ్జెక్ల్ ల‌ కు శిక్ష‌ణ‌….!త్రిశూల్ ర‌మ‌ణా స్కూల్ సంచ‌ల‌న నిర్ణ‌యం….!

Satyam NEWS

19,20 తేదీలలో అరుణోదయ ‌సాంస్కృతిక  సమాఖ్య రాష్ట్ర సభలు

Murali Krishna

అంగన్వాడీ సిబ్బంది సమస్యలను సంస్కరించండి

Satyam NEWS

Leave a Comment