38.2 C
Hyderabad
April 29, 2024 11: 23 AM
Slider గుంటూరు

చేదుకో కోటయ్య చేదుకో అంటూ బయలుదేరిన కాకాణి ప్రభ

#kotappakonda

ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ త్రికొటేశ్వర స్వామి తిరునాళ్ళకు ప్రభలు సిద్ధమయ్యాయి. చేదుకో కోటయ్య చేదుకో అంటూ శివనామ స్మరణ నడుమ ప్రభలు స్వామి సన్నిధికి చేరుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లోని కాకాణి గ్రామంలో కట్టిన ప్రభ ఇవాళ స్వామి వారి సన్నిధికి బయలుదేరింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్ ఎక్కి.. ప్రభను నడిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాస రావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, కాకాణి సర్పంచ్ నారాయణ, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీను ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

కరోనా టీకా వికటించి మహిళ సర్పంచ్ మృతి?

Satyam NEWS

గ్రామ వాలంటీర్లు నిజమైన ప్ర‌జా సేవకులు

Satyam NEWS

ప్రకృతికి హారతి పడుతున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్

Satyam NEWS

Leave a Comment