ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ త్రికొటేశ్వర స్వామి తిరునాళ్ళకు ప్రభలు సిద్ధమయ్యాయి. చేదుకో కోటయ్య చేదుకో అంటూ శివనామ స్మరణ నడుమ ప్రభలు స్వామి సన్నిధికి చేరుతున్నాయి. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లోని కాకాణి గ్రామంలో కట్టిన ప్రభ ఇవాళ స్వామి వారి సన్నిధికి బయలుదేరింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ట్రాక్టర్ ఎక్కి.. ప్రభను నడిపించారు. కార్యక్రమంలో ఎంపీపీ మూరబోయిన శ్రీనివాస రావు, జెడ్పీటీసీ చిట్టిబాబు, కాకాణి సర్పంచ్ నారాయణ, మాజీ ఎంపీపీ తన్నీరు శ్రీను ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
previous post
next post