ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ పంచాయతీలో సర్పంచ్ భర్తకు, కార్యదర్శికి, కాంట్రాక్టు సిబ్బంది కి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్టు సమాచారం. పంచాయతీలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి 14 నెలలుగా వేతనాలు నిలిపి వేసినట్టు తెలిసింది. 4 నెలలవేతనాల మంజూరుకు బిల్లు రూపొందించి సర్పంచ్ సంతకం కొరకు బిల్లులు పంపితే సర్పంచ్ భర్త ఆ బిల్లులను నిలిపి వేసి ముక్కలు ముక్కలుగా చించేసినట్టు కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉండగా క్లాప్ మిత్రల పేరుతో 1లక్షా 80 వేల రూపాయలు ఎవరి ఎక్కౌంట్ కి బదిలీ అయ్యాయని గ్రామస్తులు ఆరాతీస్తున్నట్టు తెలిసింది. పంచాయతీలో కాంట్రాక్టు కార్మికులనే క్లాప్ మిత్రాలుగా చూపి నిధులు కాజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
previous post