ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై సీఎం జగన్ మంత్రులకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. మంత్రి వర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రులతో సీఎం జగన్ దాదాపు గంటసేపు చర్చించారు. ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై మంత్రులతో మాట్లాడారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. ఎన్నికల కోసం ఇంకా 9 నెలల సమయం ఉందని, ఈ తొమ్మిది నెలల పాటు గట్టిగా పనిచేయాలని సూచించారు.
previous post