సభ మధ్య లో వీ సీ అంటూ స్పీచ్ ఇవ్వకుండా నే వెళ్లి పోయిన కలెక్ట్రర్….!
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములని యావత్ రాష్ట్రం గుర్తుంచు కోవాలని విజయనగరం కలెక్ట్రెట్ లో జిల్లా అధికారులు కొనియాడారు.71వ వర్థంతి సందర్భంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి కలెక్టర్ నాగలక్ష్మి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సహాయ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డి.ఆర్.ఓ అనిత, డి.ఆర్.డి.ఏ పి.డి కల్యాణ చక్రవర్తి, డి.సి.హెచ్.ఎస్. డా.గౌరి శంకర రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె. సందీప్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏ.ఓ దేవ్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.