నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ముస్లిం భక్తులు నేడు కనిపించారు. కుటుంబ సభ్యుల తో కలిసి వచ్చిన ఒక ముస్లిం జంట వారి కుమారుడికి వంద రూపాయల అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం చేసియించారు. ఆలయ ముఖ్య అర్చకులు సుధీర్ దీక్షిత్ చేతుల మీదుగా రఫిక్ కు అక్షర స్వీకార పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందం గా ఉందని సరియానుద్దీన్ మొహమ్మద్ కుటుంబ సభ్యులు తెలిపారు.
previous post