ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ అఫ్ కామర్స్ & ఇండస్ట్రీ ఫెడరేషన్ వారు విశాఖపట్నం లో నిర్వహించిన పరిచయ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆర్.కే.రోజా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ అఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పైడా కృష్ణ ప్రసాద్, అసోసియేషన్ సభ్యులు, టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్, ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధులు పాల్గోన్నారు.
రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన ప్రతిపాదనల గురించి చర్చించి ట్రావెల్ అసోసియేషన్ సభ్యుల నుండి వచ్చిన అభ్యర్థులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేస్తామని మంత్రి రోజా చాంబర్ ఆఫ్ కామర్స్ అసోసియేషన్ సభ్యులకు తెలిపారు. అనంతరం వైజాగ్ లో ఎక్సుక్లుసివ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యుర్ ఎక్స్పో లో కూడా మంత్రి ఆర్.కే. రోజా పాల్గొన్నారు. హోటల్ మేఘాలయ లో ఏపీ చాంబర్స్ ఉమెన్స్ వింగ్ నిర్వహిస్తున్న ఎక్స్పో లో మంత్రి ముఖ్యఅతిధి గా పాల్గొన్నారు.