38.2 C
Hyderabad
April 29, 2024 11: 21 AM
Slider కరీంనగర్

కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే

#jpnadda

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. కరీంనగర్ లో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు అని.. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతున్నానని అన్నారు.

ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికాడా లేడా? అని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరీంనగర్ ద్వారా రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. పాదయాత్ర 1403 km పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చిందని, ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర..ప్రజల గోస… బీజేపీ భరోసా అని స్పష్టం చేశారు. సాలు దొర.. సెలవు దొర పక్కా.. నేను వచ్చేటప్పుడు నా పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేయాలని అన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా? అని జేపీ నడ్డా అన్నారు. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశామన్నారు.

జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో 3.29 కోట్ల అప్పుల కుప్పగా మారిందన్నారు. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ… స్వర్గానికి ఎగిరినట్టుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ కవిత అవినీతి లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ నుంచి  బీఆర్ ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ… నెక్స్ట్ వీఆర్ఎస్ గా మారక తప్పద ని నడ్డా అన్నారు.

అలాగే దళితుడిని సీఎం ను చేస్తానన్న కేసీఆర్… ఆ హామీని నిలబెట్టుకున్నాడా  అని ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నాడని..”ధరణి పోర్టల్” పేరుతో…  బీఆర్ ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారని నడ్డా ధ్వజమెత్తారు. ఓవైసీ కి భయపడే..సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినోత్సవం గా కేసీఆర్ జరపడం లేదని జేపీ నడ్డా ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

కేజీ టు పీజీ ఏమైందని బీజేపీ జాతీయ అధికారులు జేపీ నడ్డా ప్రశ్నించారు. వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని..వెల్నెస్ సెంటర్ లకు బస్తీ ధవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉందని.. బస్తీ ధవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవని..తెలంగాణ  రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే… ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. జేపీ నడ్డా.

తెలంగాణ అభివృద్ధి ని కోరుకునే ప్రతి ఒక్కరూ… బీజేపీ తో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. బీజేపీ పాదయాత్రలు ఆగవని… పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయని. ప్రతి గడిపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాయని నడ్డా నొక్కి చెప్పారు. తెలంగాణ లో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయమని.. వచ్చేది బీజేపీ ప్రభుత్వ మేనని స్పష్టం చేశారు.

Related posts

తెలంగాణా సాధించింది బిజెపి నేత సుష్మా స్వరాజ్

Satyam NEWS

అంబేద్కర్ మనకు ఇచ్చిన గొప్ప బహుమతి రాజ్యాంగం

Satyam NEWS

విద్యార్థులకు న్యాయం చేయాలి

Sub Editor

Leave a Comment