నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గోరేటి జంగయ్య కు శుక్రవారం ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీ చంద్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా గోరేటి జంగయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన చల్లా వంశీ చందర్ రెడ్డి కి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డికి, జిల్లా ప్రధాన కార్యదర్శి మిరియాల శ్రీనివాస్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్ రవీందర్ రెడ్డి అయ్యో శేఖర్ సైదులు తదితరులు పాల్గొన్నారు.