అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షతన హన్మకొండ లోని మల్లికాంబ మనోవికాస కేంద్రం, ఆనంద నిలయం, స్పందన మానసిక దివ్యాంగుల ఆశ్రయం లో దివ్యాంగులు మరియు అనాధ పిల్లల మధ్య దీపావళి సంబరాలు నిర్వహించారు. దీపావళి సంబరాలు సందర్భంగా పిల్లలకు బాణాసంచా, స్వీట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పండుగ అంటే మనం మాత్రమే సంతోషంగా ఉండటం కాదని పది మందిని సంతోష పెట్టడం అని అందుకే ప్రతి పండుగ ఇలాంటి పిల్లల మద్య జరుపు కుంటానని తెలిపారు. అది ఎంతో సంతృప్తి నందిస్తుందని అన్నారు. అనాధ, దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని అన్నారు. ప్రతి ఒక్కరూ తోచిన మేర ఈ పిల్లల సేవకు ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. పిల్లలు కాకరపుల్లలు, భూచక్రాలు, చిచ్చు బుడ్లు వంటివి కాల్చుతూ ఆనందంగా కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమం లో సుచరిత, రాజేందర్ రెడ్డి, కళ్యాణ్, సుజాత పిల్లలు, సిబ్బంది పాల్గొన్నారు.
previous post