చిత్తూరు జిల్లా కాణిపాకం పంచాయతీ అగరంపల్లి దళితవాడకు చెందిన నరసింహులు పంచాయితీకి రాలేదని అగ్ర కులస్తులు గ్రామం నుండి వెలి వేశారు.
పంచాయితీకి రాలేదనినే సాకు తో తనను కులం పేరుతో దూషిస్తూ తనను జయచంద్రారెడ్డి గ్రామం నుంచి బహిష్కరించారని ఆయన అన్నారు.
ప్రభుత్వం ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర కార్యదర్శి పరదేశి డిమాండ్ చేశారు.
ఈ విషయమై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నామని ఆయన తెలిపారు.