38.2 C
Hyderabad
May 3, 2024 19: 42 PM
Slider ప్రత్యేకం

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై అధికార పార్టీ కౌన్సిలర్ ఫిర్యాదు

#mahaboobnagar

మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉన్నదని  టీఆరెస్ కు చెందిన మహబూబ్ నగర్ లోని రాం నగర్ 43వ వార్డు కౌన్సిలర్ బూర్జు సుధాకర్ రెడ్డి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్ కు, అధికారులకు ఫిర్యాదు చేశానని అందువల్ల కక్ష తీర్చుకొనేందుకు పోలీసులతో కొమ్మకై తనను వేధిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మంత్రి తనను హత్య చేయించాలని చూస్తున్నాడని, తనకు ప్రాణ రక్షణ కల్పించాలని హెచ్చార్సీని కౌన్సిలర్ కోరారు. మంత్రి ప్రోద్బలంతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని కౌన్సిలర్ మొర పెట్టుకున్నారు. దయచేసి కేటీఆర్ తనకు రక్షణ కల్పించి, మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Related posts

అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించిన జూపల్లి

Satyam NEWS

టెస్టింగ్:పాక్‌ క్రూయిజ్‌ క్షిపణి రాద్‌–2 సక్సెస్‌

Satyam NEWS

దేశం విడిచిపెట్టిపోతున్న కోటీశ్వరులు

Satyam NEWS

Leave a Comment