Slider మహబూబ్ నగర్

వచ్చే ఎలక్షన్లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే

#Congress government

ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసినముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టి దేశ ప్రజలను మోసం చేయడానికి వెళుతున్నాడని నాగర్ కర్నూల్ జిల్లా ఓబిసి సెల్ అధ్యక్షులు రామ్ యాదవ్ అన్నారు. జనవరి 22 వ తేదీన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ దళిత గిరిజన ఆత్మగౌరవ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి వస్తున్నారు.

దీనికోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు ఆదేశానుసారం కొల్లాపూర్ పట్టణంలో నేడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1200 మంది అమర వీరుల త్యాగం చూసి తల్లి సోనియా గాంధీ తెలంగాణ కు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మాట తప్పిన కేసీఆర్ తెలంగాణ రాగానే మాట తప్పారని ఆయన అన్నారు.

తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన కుటుంబానికి పదవులు వచ్చాయి తప్ప తెలంగాణ యువకులకు రాలేదని ఆయన అన్నారు. రాష్ట్ర వస్తే నీళ్లు నిధులు నియామకాలు ఏమాయేనో తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చెప్పాలని ఆయన అన్నారు. ఇంటికొక ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లను, గిరిజన బందు, పోడు భూములకు పట్టాలు, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు జాడనే లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని 9 సంవత్సరాలు గడిచిన ఊసేలేదు అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరుశురాం, టౌన్ అధ్యక్షులు కాంతారావు, కోడేరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్, టౌన్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కురుమయ్య, ముకుడిగుండం గ్రామ అధ్యక్షులు నాగన్న పాల్గొన్నారు.

Related posts

అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతున్న మిల్లర్లు

Satyam NEWS

కావలి ఎమ్మెల్యేపై ఎస్ సి ఎస్ టి కేసు పెట్టాలి

Bhavani

వివాదస్పద కొటియా గ్రామస్థులకు అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment