41.2 C
Hyderabad
May 4, 2024 17: 56 PM
Slider మహబూబ్ నగర్

సిజేఆర్ జోడో యాత్రకు అన్ని ఏర్పాట్లు సిద్ధం?

#jagadeswararao

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం పరిధిలో టీపీసీసీ సభ్యులు,నియోజకవర్గ సీనియర్ నాయకులు చింతలపల్లి జగదీశ్వర్ రావు హత్ సే హత్ అభినవ జొడోయాత్ర కు అన్ని ఏర్పాట్లు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 26 నుండి ఆయన కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో యాత్ర చేపట్టనున్నారు. ప్రజల నుండి ప్రతి  సమస్య తెలుసుకునే విధంగా   ఏర్పాట్లు  చేయబోతున్నారు ఆయన అనుచరులు ప్రత్యేక వాహనాలు కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. ఇతర రాష్ట్రాల నుండి ప్రత్యేక వాహనాలను తీసుకురాబోతున్నాట్లు సమాచారం.

ఆ వాహనంలో పదిమంది కూర్చొని చర్చించే విధంగా సౌకర్యం కూడా  ఉండబోతున్నట్లు తెలిసింది. జనవరి 26 నుండే రాష్ట్రంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  జోడో యాత్ర చేపట్టనున్నారు. ఆ రోజు నుండే చింతలపల్లి జగదీశ్వర్ రావు కొల్లాపూర్ నియోజకవర్గంలో యాత్ర చేపట్టనున్నారు. ముందుగా సోమశిల లలిత సోమేశ్వరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర చేపట్టనున్నానట్లు సమాచారం. జనవరి 26 రిపబ్లిక్ డే జరుపుకొని కార్యక్రమం చేపట్టబోతున్నాట్లు తెలిసింది. ఇప్పటికై ఆయన పై నియోజకవర్గంలో సానుభూతి పెరిగింది. ఇప్పటికే నియోజకవర్గంలో క్రీడలు నిర్వహించి  క్రీడాకారులల్లో క్రీడా స్ఫూర్తిని నింపుతున్నారు.నిరుద్యోగులకు గ్రూప్ – 4 నాణ్యమైన మెటీరియల్ పంపిణీ చేసి ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. ఈ యాత్రతో  ఆయన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉన్నది.

Related posts

అత్యవసర పరిస్థితిలలో ఫోన్ చేయండి

Sub Editor

రైలు కిందపడి చనిపోవాలనుకున్న ముగ్గుర్ని అనంతపురం త్రీటౌన్ పోలీసులు కాపాడారు

Bhavani

నిరాశ్రయులకు నిత్యావసరాలు అందించిన నవజీవన్ ఆర్గనైజేషన్

Satyam NEWS

Leave a Comment