రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే కష్టపడాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కావలిలో శనివారం జరిగిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ సభ ఉద్దేశం ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడమేనని అన్నారు. వైసిపి ఇన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రతిపక్షం అర్థం లేని విమర్శలు చేస్తుందని పేర్కొన్నారు. అందుకని పార్టీ వర్గాలు సంఘటితం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి పేద కుటుంబానికి లబ్ధిని అందిస్తున్న పార్టీకి విజయాన్ని చేకూర్చే దిశగా కృషి జరగాలన్నారు. కావలి నియోజకవర్గంలో రామాయపట్నం పోర్టు, ఫిషింగ్ హార్బర్, వంటకాలువలు పూర్తి అయితే నెల్లూరు లాగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.
వైసీపీ పార్టీ వ్యవస్థ టిడిపి కంటే బలంగా ఉందని, అందువల్ల రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా శ్యాంసుందర్ రెడ్డిని, చంద్రశేఖర్ రెడ్డిని కూడా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ జిల్లా కోఆర్డినేటర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కావలి పరిశీలకులు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అలాగే విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, పార్టీ కార్యకర్తలు, శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.