ఇటీవల తుఫాను, వరదల కారణంగా నిరాశ్రయులైన నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని గాంధీ గిరిజన కాలనీ,స్టవ్ బీడీ కాలనీ, నేతాజీ కాలనీ,ఎస్.టి కాలనీలకి చెందిన బాధితులకు విప్రో సంస్థ ఆర్థిక సహకారం తో నవజీవన్ ఆర్గనైజేషన్ నిత్యావసరాలు పంపిణీ చేసింది. వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధితులకు ఒక నెలకు సరిపోను 18 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎంపిడిఓ శ్రీహరి, నవజీవన్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు, నోడల్ ఎన్జీఓ శ్రీ.కాలువ సహదేవయ్య, జీఓ – ఎన్జీఓ నోడల్ అధికారి ఏ. మహేందర్ రెడ్డి, కోవూరు ZPTC కె.శ్రీలత, ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ సుధాకర్, పిఎంపి అసోసియేషన్ అధ్యక్షులు శాఖవరపు వేణుగోపాల్,రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎస్.కె.రసూల్,బ్లాక్ బోర్డ్ మిత్రమండలి అధ్యక్షులు నరసాపురం ప్రసాద్, శ్రీనివాసులు, సుబ్రమణ్యం,ఎస్.రమేష్,పి.ఎమ్.బిందుమాధవి & టీమ్, రూడ్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
కె.రమాకాంత్