దురదృష్టవశాత్తు మూడు రోజుల క్రితం తేనెటీగల దాడిలో గాయపడిన శ్రీరంగపూరం జెడ్పీటీసీ, టీపీసీసీ బీసీ విభాగం ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర జెడ్పీటీసీ సంఘం వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ ను కొల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు రంగినేని అభిలాష్ రావు మంగళవారం పరామర్శించారు.
రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాములు యాదవ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి,యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్ యాదవ్,యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ చిన్న గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.