పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర వైఖానస ఆగమ పాఠశాల వేద పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వారికి నేడు ధృవపత్రాలను అందచేశారు. 2014 వ సంవత్సరంలో అడ్మిషన్ పొంది ఆరు సంవత్సరముల పాటు అధ్యయనం పూర్తి చేసిన 16 మంది నేడు ఈ ధృవపత్రాఅను అందుకున్నారు.
వీరంతా వేదాలు, ఉపనిషత్తులు, ఆగమ శాస్త్రాల అధ్యయనం పూర్తి చేశారు. ఈ 16 మంది విద్యార్థులకు గౌరవ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ఎస్ వి సుధాకరరావు వేద పఠనాల అధ్యయన ధృవపత్రాలను, ఉత్తీర్ణత పత్రములను, గౌరవ పారితోషికాన్ని అందించారు.
ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం లో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత పారితోషికాన్ని, మంచి విద్యను అందిస్తున్న గొప్ప విద్యాసంస్థగా ద్వారకా తిరుమల వేద పాఠశాల ప్రసిద్ధి గాంచింది అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణాధికారి వేండ్ర త్రినాధ రావు ఏ ఈ ఓ కే.యల్.యన్ రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీవి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులందరూ పాఠశాలలో దేవస్థానం వారిచే అద్భుతమైన రీతిలో సౌకర్యాలు కల్పించబడుతున్నాయని, ఈ పాఠశాలలో చదువుకుని సర్టిఫికెట్లు అందుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు.